ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 9061 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నవంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా ప్రకటన ద్వారా 1849 స్కూల్ అసిస్టెంట్స్, 812 లాంగ్వేజ్ పండిట్స్, 156వ్యాయామ విద్య ఉపాధ్యాయులు (పీఈటీ), 6244సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక రాత పరీక్షలను 2015 మే 9, 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కమ్ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్ కమ్ టీఆర్టీ) పేరుతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామక పరీక్షను డీఎస్సీగా వ్యవహరించేవారు. ఇకపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రత్యేకంగా ఉండదని, టెట్ కమ్ టీఆర్టీలోనే అంతర్భాగంగా ఉంటుందని మంత్రి చెప్పారు.మరో ప్రకటనలో.... ఆంధ్రప్రదేశ్ మున్సిపల్శాఖ తరఫున 1252 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో 184 స్కూల్ అసిస్టెంట్లు, 214 భాషా పండితులు (గ్రేడ్-2), 41 పీఈటీ, 813 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. వీటినిటెట్ కమ్ టీఆర్టీ -2014ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అభ్యర్థుల అవగాహన కోసం మారిన పరీక్షా విధానాన్ని అందిస్తున్నాం. దీనికి అనుగుణంగా తమ సన్నద్ధతను మెరుగుపరచుకోవచ్చు
http://teacher4us.com/AP%20DSC%202014%20recruitment%20vacancies%209061%20posts.html
http://teacher4us.com/AP%20DSC%202014%20recruitment%20vacancies%209061%20posts.html
Comments
Post a Comment